అమెరికాలో భారతీయ నర్స్‌ దారుణ హత్య!

కేరళకు చెందిన ఓ నర్సు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యింది. కొట్టాయంకు చెందిన మెరీన్‌ జాయ్‌(26)తన భర్తతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తోంది.

Published : 30 Jul 2020 02:56 IST

భర్తను అరెస్టు చేసిన పోలీసులు

మియామీ: కేరళకు చెందిన ఓ నర్స్‌ అమెరికాలో దారుణ హత్యకు గురయ్యింది. కొట్టాయంకు చెందిన మెరీన్‌ జాయ్‌(26)తన భర్తతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తోంది. అక్కడే ఉన్న ఆసుపత్రిలో మెరీన్‌ నర్సుగా సేవలందిస్తోంది. అయితే, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం మెరీన్‌ తన విధులను ముగించుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో పార్కింగ్‌ స్థలంలో వేచివున్న ఆమె భర్త ఫిలిప్‌ మ్యాథ్యూ కత్తితో  విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన మెరీన్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు  పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడ్డ ఫిలిప్‌ మ్యాథ్యూను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని