నడిరోడ్డుపై మేనమామను చంపిన అల్లుడు

జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక వడ్డెర కాలనీలో సొంత మేనమామను అల్లుడు నడిరోడ్డుపై కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో

Published : 27 Sep 2020 18:04 IST

జగిత్యాల జిల్లాలో దారుణం

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక వడ్డెర కాలనీలో సొంత మేనమామను అల్లుడు నడిరోడ్డుపై కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో గొల్లెం నడిపి రాజం(60), అతడి మేనల్లుడు శివరాత్రి అంజయ్యకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వడ్డెర కాలనీలోని హోటల్‌ వద్ద ఉన్న నడిపి రాజంపై అంజయ్య కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో నడిపి రాజం అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనాస్థలాన్ని అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్‌, జగిత్యాల రూరల్‌ సీఐ రాజేశ్‌, ఎస్సై సతీశ్ పరిశీలించారు. నిందితుడు అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని