మాస్క్ ధరించనని మొండిపట్టు.. చివరకు అరెస్టు
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సాల్ట్ లేక్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు...........
అమెరికాలో ఓ వ్యక్తి నిర్వాకంతో విమానం ఆలస్యం
సాల్ట్లేక్ సిటీ: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సాల్ట్ లేక్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ. 44 ఏళ్ల వ్యక్తి మాస్క్ ధరించకుండా శాన్ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు సాల్ట్లేక్ సిటీ విమానాశ్రయానికి వెళ్లాడు. సిబ్బంది అతడిని మాస్క్ ధరించాలని చెప్పినా వినకుండా విమానం ఎక్కాడు. దీంతో ఆ వ్యక్తిని కిందకు దించేందుకు ప్రయత్నించే క్రమంలో ఆ విమానం 45 నిమిషాల పాటు ఆలస్యమైంది. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు అక్కడి మీడియా తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..
ఝోషువా కోల్బీ కౌన్సిల్ అనే వ్యక్తి బుధవారం రాత్రి మాస్క్ ధరించకుండా విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. గేట్ ఏజెంట్ అతడిని అడ్డుకొని మాస్క్ పెట్టుకోవాలని చెప్పాడు. అయినా ఖాతరు చేయకుండా కోల్బీ ముందుకు సాగాడు. దీంతో అతడిని అనుసరించిన ఏజెంట్.. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉందని చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా విమానం ఎక్కాడు. విమానంలో కెప్టెన్, ఇతర సిబ్బంది చెప్పినా చెవికెక్కించుకోలేదు. దీంతో వారు విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అతడిని విమానం నుంచి దించేయాలని సూచించారు. అయినా అతడు సీటునుంచి లేచి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. అతడి మొండి ప్రవర్తనకు విసిగిపోయిన తోటి ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో చివరకు అతడు విమానం దిగాడు. ఈ ఘటనతో దాదాపు 45 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది. తమ విమానం ఆలస్యమైనందుకు గాను ప్రయాణికులకు డెల్టా ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్పింది. అమెరికాలో ఇప్పటికే కరోనాతో 2.64లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కూడా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని