టెస్ట్ రైడ్ చేస్తానంటూ బైక్ దొంగతనం..
రిక్షా నడిపుకునే వ్యక్తి మొబైల్ నుంచి సిమ్ చౌర్యం చేసిన ఓ వ్యక్తి దాని సాయంతో బైక్ను దొంగిలించిన ఘటన కోల్కతాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ రాష్ర్టంలోని నార్త్ 24 పర్గనాస్ జిల్లాకు చెందిన
కోల్కతా : రిక్షా నడుపుకొనే వ్యక్తి మొబైల్ నుంచి సిమ్ చౌర్యం చేసిన ఓ వ్యక్తి దాని సాయంతో బైక్ను దొంగిలించిన ఘటన కోల్కతాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ రాష్ర్టంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన గౌరంగ కిర్తానియా అనే వ్యక్తి.. రిక్షా నడుపుకునే వ్యక్తి సెల్ఫోన్ నుంచి సిమ్కార్డును దొంగిలించాడు. ఆ సిమ్ వేసుకొని బైకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ఓ వైద్యుడికి ఫోన్ చేశాడు. అంతకు ముందు ఈ వైద్యుడు తన ద్విచక్రవాహనాన్ని విక్రయించడానికి ఆన్లైన్ ఫ్లాట్ఫాంలో ప్రకటన ఇచ్చారు.
దీంతో నిందితుడు వైద్యుడికి ఫోన్చేసి తాను బైకును కొంటానని ఓ ప్రాంతానికి వైద్యుడిని పిలిపించాడు. నిందితుడు చెప్పిన ప్రదేశానికి గత నెల 2వ తేదీ బైకుతో వెళ్లిన వైద్యుడిని అతను మాటలతో నమ్మించాడు. బైక్ను టెస్ట్ రైడ్ చేస్తానని అడిగాడు. దీనికి వైద్యుడు అంగీకరించడంతో టెస్ట్రైడ్ అని వెళ్లిన నిందితుడు తిరిగిరాలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. రెండు రోజుల కిందట నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా రిక్షా నడుపుకునే వ్యక్తిని ఇటీవల నిందితుడు తన వద్ద పనికి కుదుర్చుకున్నాడని తెలిసింది. దీంతో పాటు దొంగిలించిన సిమ్ వేసి వైద్యునికి కాల్ చేసిన మొబైల్ కూడా దొంగిలించిందే అని నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇలా మరొకరి సిమ్తో ఫోన్ చేస్తే.. బైకు దొంగిలించి పారిపోతే పోలీసులకు దొరకకుండా ఉండొచ్చని నిందితుడు పథకం వేశాడని వారు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.