ఎల్లారెడ్డిలో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంగళవారం ఉదయం చిన్నారి అదృశ్యమైన అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. బుధవారం ఉదయం గ్రామసమీపంలోని నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో ..

Updated : 04 Nov 2020 14:01 IST

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంగళవారం ఉదయం చిన్నారి అదృశ్యమైన అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. బుధవారం ఉదయం గ్రామసమీపంలోని నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతులకు మూడవ కుమార్తె అయిన సౌమ్య(2) మంగళవారం ఉదయం ఇంటిముందు అడుకుంటూ కనిపించకుండాపోయింది. కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినప్పటికి జాడ తెలియకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి డాగ్‌స్వ్కాడ్‌తో వెతికినప్పటికీ అచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే బుధవారం చిన్నారి మృతదేహాన్ని నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో స్థానికులు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడే చేరుకుని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు.చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై శ్వేత తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు