కొవిడ్ వంకతో ప్రియురాలి చెంతకు
తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు భార్యకు అబద్ధం చెప్పిన భర్త
భార్యకు అబద్ధం చెప్పి భర్త నిర్వాకం
ముంబయి: తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు భార్యకు అబద్ధం చెప్పిన భర్త ప్రియురాలి దగ్గరకు చేరిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబయికి చెందిన వ్యక్తి జులై 21న తన భార్యకు ఫోన్ చేసి కరోనా వచ్చినట్లు చెప్పాడు. తాను ఇండోర్ వెళ్తున్నానని ఇక తనకు బతకాలని లేదని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అతని బైకు, హెల్మెట్, పర్సును స్థానికంగా ఉండే వాషీ ఏరియాలో గుర్తించారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొవిడ్ కేర్ కేంద్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో గాలించినా వ్యక్తి ఆచూకీ దొరకలేదు. సదరు వ్యక్తి చనిపోతానని చెప్పటం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయటంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానించి మృతదేహం కోసం కూడా గాలించారు. ఎట్టకేలకు.. గత వారం కొవిడ్ పేరుతో మాయమైన వ్యక్తి తన పేరు, చిరునామా మార్చి ప్రియురాలితో కలిసి ఇండోర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ముంబయి తీసుకొచ్చి భార్యకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.