యువకుడి నిర్లక్షానికి నిండు ప్రాణం బలి!
ఓ యువకుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అవగాహన లేకపోవటం, జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే తీరుగా..........
హైదరాబాద్: ఓ యువకుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అవగాహన లేకపోవటం, జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే తీరుగా నగరంలో ఇటీవల జరిగిన ఘటన ఓ కుటుంబంలో నింపిన విషాదం, ఆ ఇంటి అరణ్య రోదన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగరంలోని సరూర్నగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన సుబ్బారావు, ప్రగా టూల్స్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేసి కొన్ని రోజుల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయనకు ఓ కుమార్తె. వైకల్యంతో పుట్టిన ఆమెను సీఏ చదివిస్తున్నారు. ఆమె పరీక్షా కేంద్రాన్ని ముందుగా చూసేందుకు ఈ నెల 19న హబ్సిగూడకు వెళ్లిన ఆయన అక్కడ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. వాహనం నడిపిస్తున్న ఉప్పల్కు చెందిన ప్రదీప్, అతని స్నేహితుడు.. సుబ్బారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆటోలో ఆయనను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తలకు బలమైన గాయం కావడం వల్ల కోమాలోకి వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆదివారం సుబ్బారావు మృతి చెందారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ఓయూ పోలీసులు.. ఆయనను ఢీకొట్టిన ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఈ యువకుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడిపినట్లు గుర్తించారు. లైసెన్స్ లేకున్నా, నిబంధనలు తెలియకున్నా కుమారుడు అడిగిన వెంటనే తల్లిదండ్రులు బైక్ కొనిచ్చారు. ఈ క్రమంలోనే కనీస నిబంధనలు మరిచిన ప్రదీప్ నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఓ కుటుంబం రోడ్డున పడేందుకు కారణమయ్యాడు. కుటుంబానికే పెద్ద దిక్కైన ఆయన మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. తమలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.