రూ.2.5 కోట్ల విలువైన పార్టీ డ్రగ్స్ పట్టివేత
భారీ కంజైన్మెంట్లలో నిల్వ ఉంచిన పార్టీ డ్రగ్, యాబా ట్యాబ్లెట్లను కోల్కతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో..
కోల్కతా: పార్టీ డ్రగ్స్గా వ్యవహరించే యాబా ట్యాబ్లెట్లను పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తుండగా కోల్కతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీటిని బంగ్లాదేశ్కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్టయిన వారి నుంచి 50 వేల ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
బీఎస్ఎఫ్ దళాలు పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన తరువాత 2019 నుంచి యాబా ట్యాబ్లెట్ల అక్రమ రవాణా పెరిగింది. దక్షిణ బెంగాల్లోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా ఈ వ్యాపారం జోరందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మణిపూర్కు చెందిన ఇద్దరు మాదకద్రవ్యాల డీలర్లను దక్షిణ కోల్కతాకు చెందిన ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.2.3 కోట్ల విలువైన యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.