హీరోయిన్ల బెయిల్‌ అభ్యర్థనలు తిరస్కరణ

శాండల్‌ వుడ్‌ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రాణి బెయిల్‌ అభ్యర్థనలను కర్ణాటక హైకోర్టు మరోసారి తిరస్కరించింది. ఆగస్టు నెలలో కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్‌ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు సెప్టెంబరులో హీరోయిన్లు ఇద్దరిని అరెస్టు చేశారు. వీళ్లు పార్టీల్లో డ్రగ్స్‌ తీసుకునేవాళ్లనే ఆరోపణలతో

Published : 04 Nov 2020 00:41 IST

బెంగళూరు : శాండల్‌ వుడ్‌ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రాణి బెయిల్‌ అభ్యర్థనలను కర్ణాటక హైకోర్టు మరోసారి తిరస్కరించింది. ఆగస్టు నెలలో కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్‌ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు సెప్టెంబరులో హీరోయిన్లు ఇద్దరిని అరెస్టు చేశారు. వీళ్లు పార్టీల్లో డ్రగ్స్‌ తీసుకునేవాళ్లనే ఆరోపణలతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.  

గత రెండు నెలలుగా ఈ ఇద్దరు బెయిల్‌ కోసం పలుమార్లు ప్రయత్నించారు. తాజాగా వీళ్ల అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్‌ శ్రీనివాస్‌ హరీశ్ కుమార్‌ బెయిల్‌ను మరోసారి తిరస్కరించారు. ఆగస్టు నెలలో నార్కోటిక్‌ అధికారులు బెంగళూరులో కొందరు మాదకద్రవ్యాల విక్రేతలను పట్టుకున్నారు. విచారణ జరిపిన పోలీసులు డ్రగ్స్‌ విక్రేతలకు చందనసీమ, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. అధికారులు ఇప్పటి వరకూ ఈ కేసులో 15 మంది వరకూ అరెస్టు చేశారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని