భార్యను హత్య చేసి.. వీడియో గేమ్‌ ఆడుతూ..

భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహం పక్కనే తాపీగా వీడియో గేమ్‌ ఆడుతూ కనిపించాడు...

Published : 08 Dec 2020 11:20 IST

జోద్‌పుర్‌: భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహం పక్కనే తాపీగా వీడియో గేమ్‌ ఆడుతూ కనిపించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జోద్‌పుర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని బీజేఎస్‌ కాలనీకి చెందిన విక్రమ్‌సింగ్‌ (35), శివ్‌ కన్వర్‌ (30) భార్యాభర్తలు. విక్రమ్‌సింగ్‌ జులాయిగా తిరుగుతూ ఏ పని చేసేవాడు కాదు. శివ్‌ కన్వర్‌ కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన విక్రమ్‌సింగ్‌ భార్యపై కత్తెరలతో దాడికి పాల్పడ్డాడు. ఆమెను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. 

అనంతరం అత్తామామలతోపాటు పోలీసులకు విషయాన్ని ఫోన్‌ ద్వారా వెల్లడించాడు. అయితే పోలీసులు అతడి ఇంటికి చేరుకునేసరికి భార్య నెత్తురు మడుగులో పడిఉండగా పక్కనే కూర్చొని సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ కనిపించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఘటన జరిగినప్పుడు వారు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

కృష్ణా జిల్లాలో రక్తమోడిన రహదారులు

భార్య గొంతు కోసి.. ఆపై తానూ కోసుకుని

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని