కుమారుడు జన్మించాలని కూతురి తల నరికిన తండ్రి

సాంకేతిక పరిజ్ఞానంతో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు....

Published : 15 Nov 2020 03:06 IST

రాంచి: సాంకేతిక పరిజ్ఞానంతో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఒళ్లు గగురుపొడిచే సంఘటన చోటుచేసుకుంది. ఓ మంత్రగాడి మాటలు నమ్మిన వ్యక్తి కన్న కూతురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. లాహోర్‌దాగాలోని పేష్రార్‌కు చెందిన సుమన్‌ నగాసియా (26) దినసరి కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. కుమారుడు కావాలనే కోరికతో ఉన్న సుమన్‌కు ఓ మంత్రగాడి గురించి తెలిసింది. దీంతో అతడిని సంప్రదించాడు. అయితే కూతురిని బలిస్తే నీకు మగబిడ్డ కలుగుతాడని ఆ మాంత్రికుడు చెప్పడంతో విచక్షణ కోల్పోయిన సుమన్‌ తన కుమార్తెను చంపేందుకు వెనకాడలేదు. అత్యంత దారుణంగా తల నరికి హత్య చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని