బెయిల్పై వచ్చి.. చనిపోయినట్లు నమ్మించి!
అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి శిక్ష తప్పించుకోవడానికి పథకం వేసి ఎదురుదెబ్బ తిన్నాడు. తాను చనిపోయినట్లు నమ్మించేందుకు ఓ వ్యక్తిని హతమార్చి చివరికి పోలీసులకు చిక్కాడు. తనతో పాటు తన.....
లఖ్నవూ: అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి శిక్ష తప్పించుకోవడానికి పథకం వేసి ఎదురుదెబ్బ తిన్నాడు. తాను చనిపోయినట్లు నమ్మించేందుకు ఓ వ్యక్తిని హతమార్చి చివరికి పోలీసులకు చిక్కాడు. తనతో పాటు తన భార్యను, బంధువును కూడా కటకటాలపాల్జేశాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేరఠ్కు చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి ఇటీవల బెయిల్పై బయటికి వచ్చాడు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఓ పథకం వేశాడు. రాజ్కుమార్ తాను నివాసం ఉండే ప్రాంతంలోని ఓ మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తికి తన బట్టలు, కొంత డబ్బు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న వ్యక్తి ఆ బట్టలను వేసుకోడానికి అంగీకరించాడు. భార్య, మరో బంధువు సాయంతో రాజ్కుమార్ ఆ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు.
చనిపోయిన వ్యక్తిని పోలీసులు రాజ్కుమార్ అని అనుకోవాలని అతని ముఖాన్ని ఛిద్రం చేశారు. దాంతో పాటు తన ఆధార్కార్డును రాజ్కుమార్ మృతదేహం వద్ద పడేశారు. సెప్టెంబరు 23న పోలీసులు అటవీ ప్రాంతంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ వారికి రాజ్కుమార్ ఆధార్కార్డు లభ్యమైంది. చనిపోయిన వ్యక్తి ముఖంపై ఆనవాళ్లు లేకపోవడం, మృతదేహం ఉన్న ప్రదేశంలో రాజ్కుమార్ ఆధార్కార్డు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రాజ్కుమారే ఈ హత్య చేశాడనే ప్రాథమిక అంచనాతో వాళ్లు దర్యాప్తు ప్రారంభించారు.
భర్త మృతికి సంబంధించి రాజ్కుమార్ భార్యతో మాట్లాడిన పోలీసులు అతడి ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఆ నంబర్ ఆధారంగా రాజ్కుమార్ సెల్ఫోన్ అలీఘఢ్ ప్రాంతంలోని ఓ మొబైల్ దుకాణంలో ఉన్నట్లు కనుగొన్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులు రాజ్కుమార్ ఫోటోను చూపించగా 24వ తేదీ అతడే తనకు సెల్ఫోన్ విక్రయించినట్లు మొబైల్ దుకాణం యజయాని తెలిపారు. దీంతో పోలీసులు అనుమానించిందే నిజమైంది. రాజ్కుమార్ భార్యను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజ్కుమార్ ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకున్నారు. తాను తప్పించుకోవడానికి మరో వ్యక్తిని హత్య చేసిన రాజ్కుమార్ మళ్లీ పోలీసులకు చిక్కాడు. అతడికి సహకరించిన అతడి భార్యను, సమీప బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!