జాతీయ రహదారిపై నోట్ల కట్టలు కలకలం..!
అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై నోట్ల కట్టలు పడి ఉన్నాయనే సమాచారం కలకలం రేపింది.
ఓ రైతు సరదాగా చెప్పిన మాటకు జోరుగా ప్రచారం
వివరాలు వెల్లడించి రాయదుర్గం ఎస్సై
రాయదుర్గం: అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై నోట్ల కట్టలు పడి ఉన్నాయనే సమాచారం కలకలం రేపింది. రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రూ.10లక్షల విలువ చేసే రూ.500నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండగా కొందరు వాటిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. బొమ్మక్కపల్లి, 74ఉడేగోళం గ్రామాలకు చెందిన కొందరు నోట్ల కట్టలు తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే నగదు ఏరుకున్న వ్యక్తులు నోట్ల కట్టలు తమవేనంటూ తీసుకెళ్లినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. రహదారిపై భారీగా నగదు దొరికిందనే ప్రచారంతో సమీప గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. దీనిపై అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన వివరాలను రాయదుర్గం ఎస్సై రాఘవేంద్రప్ప మీడియాకు వెల్లడించారు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నోట్ల కట్టలు బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన ఓబులేసు అనే రైతుకు చెందినవిగా గుర్తించారు. ఓబులేసుకు రాయదుర్గం సిండికేట్ బ్యాంకులో క్రాప్లోన్ కింద రూ.1.94లక్షల మంజూరైంది. ఖాతాలో రూ.2వేలు నగదును అలానే ఉంచి, మిగిలిన రూ 1.92లక్షల నగదు బ్యాంకు నుంచి డ్రా చేసి టవల్లో పెట్టుకుని బయల్దేరాడు. మార్గంమధ్యలో రోడ్డుపై టవల్ పడిపోయింది. అనంతరం సదరు రైతు ఆ డబ్బును తన లుంగీలో కట్టుకుని వెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు ఓబులేసును ప్రశ్నించగా రూ.500 రూపాయల నోట్ల కట్టలు రూ.4-5 లక్షల దాకా దొరికాయని సరదాగా చెప్పాడు. అయితే ఆ రైతు చెప్పిన మాటలను స్థానికులు నిజమని నమ్మడంతో నోట్ల కట్టలు దొరికాయనే ప్రచారం జోరుగా జరిగింది. అంతే తప్ప జాతీయ రహదారిపై డబ్బు దొరికిందనేది తప్పుడు ప్రచారమని.. ఆ రైతు బ్యాంకు నుంచి తెచ్చుకున్న నగదు పొరపాటున కిందపడటంతో దానిపై ఈ విధంగా ప్రచారం జరిగిందని ఎస్సై స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్