మేరఠ్‌లో నిర్భయ తరహా ఘటన

నిర్భయ ఘటనను తలపించేలా మీరట్‌లో కదులుతున్న బస్సులో..

Updated : 27 Sep 2020 19:48 IST

కదులుతున్న బస్సులో రాత్రంతా అత్యాచారం

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో దారుణం చోటుచేసుకుంది. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించేలా కదులుతున్న బస్సులో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రంతా మహిళపై లైంగిక దాడిచేసి అనంతరం ఆమెను బస్సులోనుంచి బయటకు తోసేశారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని కొందరు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్న ఆమె తనపై జరిగిన లైంగిక దాడిని పోలీసులకు వివరించింది.

శుక్రవారం రాత్రి భైసాలి బస్టాండ్‌లో బస్సు ఎక్కానని, అనంతరం బస్సు సిబ్బంది తనకు శీతల పానీయం ఇచ్చారని తెలిపింది. పానీయం తాగిన తర్వాత స్పృహ కోల్పోవడంతో డ్రైవర్, కండక్టర్ తనపై రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేశారు. బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా ఘటన జరగడం ఈ నెలలో ఇది మూడోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని