పెళ్లి వ్యాను బోల్తా.. 16మందికి గాయాలు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో డీసీఎం వ్యాను బోల్తాపడింది. కొల్లాపూర్‌ మండలం రామాపురం వద్ద పెళ్లిబృందంతో వెళ్తున్న వాహనం బోల్తాపడటంతో

Published : 29 Oct 2020 01:46 IST

కొల్లాపూర్‌ టౌన్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో డీసీఎం వ్యాను బోల్తాపడింది. కొల్లాపూర్‌ మండలం రామాపురం వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా పడటంతో 16 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో డీసీఎం వాహనంలో 65 మంది ఉన్నట్టు సమాచారం. వేగంగా వెళ్తున్న వాహనం రామాపురం గ్రామం సమీపంలో మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను కొల్లాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో పెళ్లి కుమారుడు రాజు సురక్షితంగా బయటపడ్డాడు. రేపు ఉదయం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో రాజు వివాహం జరగనునన నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బాధితులంతా గద్వాల మండలం జమ్మిచెడుకు చెందినవారిగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని