నిల్చున్న వారిని కాటేసిన మృత్యువు

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువద్ద రహదారి పక్కన నిల్చున్న వారిని కారు ఢీ కొట్టింది.

Published : 25 Jul 2020 00:20 IST

మునగాల: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువద్ద రహదారి పక్కన నిల్చున్న వారిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. మృతులను కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంటేరు వాసులుగా గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కారు దిగిన సమయంలో మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని