నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

హైదరాబాద్‌-నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నల్లొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా ..

Updated : 04 Sep 2020 10:05 IST

చింతపల్లి: హైదరాబాద్‌-నాగార్జునసాగర్ రహదారిపై  శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడిక్కడే  మృతి చెందిన చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన నాగేంద్ర(28), వేముల భరత్‌ (24), గణేష్‌(26), వీరితోపాటు మరో ఇద్దరు స్నేహితులు కారులో హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వైపునకు బయలుదేరారు. మార్గమధ్యంలో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా సమీపంలోని మలుపు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కృష్ణా నీటి సరఫరా దిమ్మెను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు, సర్పంచి బాలూసింగ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు రెండు గంటలకు పైగా శ్రమించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మిగతా ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని