ఆ గ్యాంగ్స్టర్ ఆస్తులపై ఈడీ విచారణకు సిఫారసు!
ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేకు చెందిన రూ.150 కోట్ల విలువైన ఆస్తులపై ఈడీతో దర్యాప్తు జరిపించాలని సిట్ సూచించింది. యూపీలో ఎనిమిది మంది పోలీసులను చంపిన ఈ గ్యాంగ్స్టర్ జులైలో .........
90మంది అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న సిట్
లఖ్నవూ: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేకు చెందిన రూ.150 కోట్ల విలువైన ఆస్తులపై ఈడీతో దర్యాప్తు జరిపించాలని సిట్ సూచించింది. యూపీలో ఎనిమిది మంది పోలీసులను చంపిన ఈ గ్యాంగ్స్టర్ జులైలో జరిగిన ఎన్కౌంటర్ హతమైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త చీఫ్ సెక్రటరీ సంజయ్ భూస్రెడ్డి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు.. 3100 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వికాస్ దూబే, అతడి గ్యాంగ్కు సహకరించిన పోలీస్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, ఆహారం, తదితర శాఖలకు చెందిన మొత్తం 90 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ అధికారులంతా వికాస్ దూబే సామ్రాజ్య విస్తరణకు సహకరించారని నివేదికలో పేర్కొంది. అక్టోబర్లో సిట్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వికాస్ దూబేపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకపోగా.. అధికారులు అతడికి, ఆ గ్యాంగ్కు నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఆయుధాలు, సిమ్కార్డులు, పాస్పోర్టులను సమకూర్చినట్టు సిట్ తన నివేదికలో వెల్లడించింది. వారందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, వికాస్ దూబే అక్రమాస్తులపై ఈడీతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలంది. ఇటీవలే కాన్పూర్ పోలీస్ చీఫ్ అనంత్ దేవ్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
యూపీలోనే కరడుగట్టిన నేరస్థుల్లో వికాస్ దూబే ఒకడు. అతడిపై హత్య కేసులు సహా దాదాపు 60 కేసులు ఉన్నాయి. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా ఎలాగోలా తప్పించుకోగలిగాడు. అయితే, జులై 2న కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని ముందే పసిగట్టాడు. రాష్ట్ర రాజధాని నుంచి 150 కి.మీ. దూరంలో ఉండే గ్రామం వరకు అనేక చోట్ల రహదారిని బ్లాక్ చేయించాడు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఓ బుల్డోజర్ సహా పోలీసులు పలు అడ్డంకులను తొలగించుకొని ముందుకుసాగారు. నేరస్థుడు ఉంటున్న గ్రామానికి చేరుకోగానే ఓ ఇంటి దాబాపై మాటువేసిన దుండగులు పోలీసులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వారి వాహనాలపై బులెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి గాయాలైన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే