‘గొంతు కోస్తుంటే ఆనందంగా ఉండేది’
మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య చేసిన ఓ సీరియల్ కిల్లర్ను గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పలు విస్తుపోయే విషయాలు వెల్లడించాడు....
విస్తుపోయే విషయాలు వెల్లడించిన సీరియల్ కిల్లర్
గురుగ్రామ్: మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య చేసిన ఓ సీరియల్ కిల్లర్ను గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. బిహార్కు చెందిన మహమ్మద్ రాజి (22) గురుగ్రామ్లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. నవంబర్ 23, 24, 25వ తేదీల్లో ముగ్గురిని అతి దారుణంగా హత్య చేశాడు. మద్యం ఆశచూసి అమాయకులను నమ్మించే రాజి 23న రాత్రి నగరంలోని లీజర్ వ్యాలీ పార్కు సమీపంలో ఓ వ్యక్తి గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు రాత్రి ఓ సెక్యూరిటీ గార్డుని సైతం ఇదే తరహాలో దారుణంగా హతమార్చాడు.
వరుస హత్యలతో అప్రమత్తమైన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తన వికృత చేష్టలను బయటపెట్టాడు. మనుషుల గొంతు కోస్తుంటే ఆనందంగా ఉండేదని పేర్కొనడం గమనార్హం. ప్రపంచానికి తానేంటో చూపించాలనుకున్నానని తెలిపాడు. అయితే విచారణలో 25వ తేదీ రాత్రి మరో హత్య చేసినట్లు వెల్లడించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాకేశ్ కుమార్ (26) అనే వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి శరీరం నుంచి తలను వేరుచేసి మరో ప్రాంతంలో పడేశాడు. ఆ తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
‘చిన్నతనం నుంచే నాకేం అర్థమయ్యేది కాదు. నేను చాలా బలహీనంగా ఉన్నానని, ఏ పనీ చేయలేనని అందరూ నన్ను ఎద్దేవా చేసేవారు. అందుకే నేనేం చేయగలనో ప్రపంచానికి చూపించాలనుకున్నా’ అని రాజి పోలీసుల వద్ద పేర్కొన్నాడు. కాగా నిందితుడు గురుగ్రామ్తోపాటు, దిల్లీ, బిహార్లో దాదాపు 10 హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం