‘గొంతు కోస్తుంటే ఆనందంగా ఉండేది’
మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య చేసిన ఓ సీరియల్ కిల్లర్ను గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పలు విస్తుపోయే విషయాలు వెల్లడించాడు....
విస్తుపోయే విషయాలు వెల్లడించిన సీరియల్ కిల్లర్
గురుగ్రామ్: మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య చేసిన ఓ సీరియల్ కిల్లర్ను గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. బిహార్కు చెందిన మహమ్మద్ రాజి (22) గురుగ్రామ్లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. నవంబర్ 23, 24, 25వ తేదీల్లో ముగ్గురిని అతి దారుణంగా హత్య చేశాడు. మద్యం ఆశచూసి అమాయకులను నమ్మించే రాజి 23న రాత్రి నగరంలోని లీజర్ వ్యాలీ పార్కు సమీపంలో ఓ వ్యక్తి గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు రాత్రి ఓ సెక్యూరిటీ గార్డుని సైతం ఇదే తరహాలో దారుణంగా హతమార్చాడు.
వరుస హత్యలతో అప్రమత్తమైన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తన వికృత చేష్టలను బయటపెట్టాడు. మనుషుల గొంతు కోస్తుంటే ఆనందంగా ఉండేదని పేర్కొనడం గమనార్హం. ప్రపంచానికి తానేంటో చూపించాలనుకున్నానని తెలిపాడు. అయితే విచారణలో 25వ తేదీ రాత్రి మరో హత్య చేసినట్లు వెల్లడించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాకేశ్ కుమార్ (26) అనే వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి శరీరం నుంచి తలను వేరుచేసి మరో ప్రాంతంలో పడేశాడు. ఆ తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
‘చిన్నతనం నుంచే నాకేం అర్థమయ్యేది కాదు. నేను చాలా బలహీనంగా ఉన్నానని, ఏ పనీ చేయలేనని అందరూ నన్ను ఎద్దేవా చేసేవారు. అందుకే నేనేం చేయగలనో ప్రపంచానికి చూపించాలనుకున్నా’ అని రాజి పోలీసుల వద్ద పేర్కొన్నాడు. కాగా నిందితుడు గురుగ్రామ్తోపాటు, దిల్లీ, బిహార్లో దాదాపు 10 హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్