crime news:అమెరికాలో మళ్లీ తుపాకీ మోత.. ముగ్గురి మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్‌ ఆంటోనియో నగరంలోని స్పోర్ట్స్‌ బార్‌లో యువకులు మధ్య చోటుచేసుకున్న....

Published : 17 Aug 2021 01:37 IST

శాన్‌ ఆంటోనియో: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్‌ ఆంటోనియో నగరంలోని స్పోర్ట్స్‌ బార్‌లో యువకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాల్పులకు దారితీసింది. దీంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. ఇద్దరికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. తెల్లవారు జామున 3.30గంటల సమయంలో బూమ్‌ బూమ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి కారులో వచ్చి పొడవైన తుపాకీతో పార్కింగ్‌ వద్దే ఐదుగురిపై కాల్పులకు తెగబడినట్టు పేర్కొన్నారు. 

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. బాధితులంతా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులేనన్నారు. నిందితుడి వయస్సు కూడా దాదాపు అంతే ఉన్నప్పటికీ తన గురించి ఏ వివరాలు చెప్పడంలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని