Asaduddin: తన కారుపై కాల్పులు.. అక్కడేం జరిగిందో చెప్పిన అసదుద్దీన్!
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీ వెళ్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన .....
దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీ వెళ్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, తన కారుపై కాల్పుల సమయంలో అక్కడేం జరిగిందో అసదుద్దీన్ ఒవైసీ దిల్లీలో విలేకర్లకు వివరించారు. ‘‘ఇవాళ మేరఠ్ పర్యటనకు వెళ్లాం. అక్కడి నుంచి దిల్లీ తిరిగి వెళ్తుండగా టోల్ గేటు వద్ద కారు వేగం తగ్గగానే పెద్ద శబ్దం వినిపించింది. ఏంటని ఆలోచించే లోపే మరో శబ్దం వినిపించింది. మా కారులో ఉన్నవారు మనపై దాడి జరుగుతోందని చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి శబ్దం వినిపించింది. నాకు తెలిసి మూడు-నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ తర్వాత దిల్లీ వెళ్తూ.. ఓ ఫ్లైఓవర్ వద్ద ఆగాం. వారు మమ్మల్ని వెంబడిస్తున్నారనిపించింది. మాపై దాడి జరుగుతున్నప్పుడు మా వెనకాల ఉన్న వాహనంలోని డ్రైవర్ షూటర్పైకి వాహనం పోనిచ్చాడు. ఎరుపు రంగు హుడీ వేసుకున్న వ్యక్తి కిందపడ్డాడు. మరో వ్యక్తి ఆ కారుపైనా కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఈసీని కోరుతున్నా. దీని వెనక ఎవరు ఉన్నారనే అంశంపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత యూపీ, కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ అంశాన్ని లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్తా’’ అని తెలిపారు.
సురక్షితంగా బయటపడినందుకు చాలా సంతోషం : కేటీఆర్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సురక్షితంగా బయటపడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘ అసద్ భాయ్.. ప్రమాదం నుంచి మీరు సురక్షితంగా బయటపడటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గం. ఈ పిరికి పంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా.’’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ