జర్నలిస్ట్ దారుణ హత్య
తమిళనాడుకు చెందిన టీవీ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. తమ అక్రమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే నెపంతో జర్నలిస్ట్ ఇంటికి వెళ్లిన దుండగులు అతడిని అపహరించి...
ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని ఆరోపణలు
చెన్నై: తమిళనాడుకు చెందిన టీవీ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. తమ అక్రమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే నెపంతో జర్నలిస్ట్ ఇంటికి వెళ్లిన దుండగులు అతడిని అపహరించి, అనంతరం దారుణంగా హత్య చేశారు. కాంచీపురం జిల్లాకు చెందిన స్రావెల్ మోసెస్ (27) టీవీ జర్నలిస్ట్గా పనిచేస్తు్న్నాడు. అయితే ఓ మాఫియా గ్యాంగ్ స్థానికంగా ఉండే సరస్సు చుట్టూ భూమిని ఆక్రమిస్తూ విక్రయిస్తోంది. సదరు గ్యాంగ్ మాదకద్రవ్యాలను కూడా అమ్ముతోంది. అయితే తమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కోపంతో ఆదివారం జర్నలిస్ట్ ఇంటికి వెళ్లిన దుండగులు అతడిని బయటకు పిలిచి అపహరించారు. అనంతరం దారుణంగా హత్యచేశారు.
కాగా ఈ హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన ప్రాణాలకు హాని ఉందని తమ కుమారుడు పోలీసులను ఆశ్రయించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జర్నలిస్ట్ తండ్రి జ్ఞానరాజ్ ఆరోపించారు. కాగా మృతుడి తండ్రి ఆరోపణలను పోలీసులు కొట్టివేశారు. మోసెస్ నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలు, భూమికి సంబంధించిన కారణాలతోనే హత్య జరిగిందని పోలీసులు అన్నారు.
హత్య కేసులో పోలీసుల స్పందనపై సీనియర్ జర్నలిస్ట్ భారతి తమిళన్ తీవ్రంగా మండిపడ్డారు. ‘సోమన్గాలమ్ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు, భూదందాపై పోలీసుకు తెలిపిన అనంతరం మోసెస్కు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అతడు పోలీసులను సంప్రదించినా వారు పట్టించుకోకపోవడంతోనే ఈ హత్య జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎలాంటి భద్రత లేకపోవడంతోనే వారిపై హత్యలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం