Ap Crime News: కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక

Updated : 04 Sep 2021 17:38 IST

కృతివెన్ను: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలంలో దారుణం చోటుచేసుకుంది. చినపాండ్రక పంచాయతీ సీతారాంపురం గ్రామంలోని ఓ మైనర్‌ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎస్సై గణేశ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలిక కోసం చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో మరుసటి రోజు సాయంత్రం 4 గంటల సమయంలో బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. ఎక్కడికి వెళ్లావు అని అడగ్గా.. విజయవాడ వెళ్లినట్లు సమాధానం ఇచ్చింది. అనంతరం గ్రామ సర్పంచి బాలికను విచారించగా అసలు విషయం బయటపెట్టింది.  గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తనను గ్రామంలోని ఓ గొడ్ల సావిడికి తీసుకెళ్లి దురాగతానికి పాల్పడ్డారని వాపోయింది. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని