ఏకంగా ఎటీఎం యంత్రాన్నే ఎత్తుకుపోయారు..!

మహారాష్ట్రలోని జల్నాలో దుండగులు రెచ్చిపోయారు. బ్యాంకును ఆనుకొని ఉన్న ఓ ఏటీఎం కేంద్రంలోకి చొరబడి ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకుపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని........

Published : 29 Nov 2020 00:50 IST

జల్నా: మహారాష్ట్రలోని జల్నాలో దుండగులు రెచ్చిపోయారు. బ్యాంకును ఆనుకొని ఉన్న ఓ ఏటీఎం కేంద్రంలోకి చొరబడి ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకుపోయారు. ఈ ఘటన జల్నా నగరం నాగేవాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన ఓ వ్యక్తి డబ్బుతో ఉన్న ఏటీఎంను తీసుకొని ముందుగానే పార్క్‌ చేసి ఉంచిన వాహనంలోకి ఎక్కించి అక్కడినుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏటీఎంలో దాదాపు రూ.28.64లక్షల నగదు ఉన్నట్టు తెలిపారు.  బ్యాంకు మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని