మెదక్ జిల్లా పిట్టలవాడలో విషాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పిట్టలవాడలో విషాదం చోటుచేసుకుంది. దండుపల్లి పంచాయతీ పిట్టలవాడ గ్రామం చెరువులో
చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
తూప్రాన్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. దండుపల్లి పంచాయతీ పిట్టలవాడ గ్రామం చెరువులో ఆడుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలవాడకు చెందిన రవి (6), నవీన్ (5), అఖిల(6) అనే చిన్నారులు మరో ఇద్దరితో కలిసి గురువారం ఆడుకుంటూ చెరువు సమీపంలోకి వెళ్లారు.
ఈ క్రమంలో నీటిలో రాళ్లు వేస్తూ ఆడుకుంటుండగా.. రవి, నవీన్, అఖిల ఒకరి తర్వాత ఒకరు చెరువులో మునిగిపోయారు. ఇది గమనించిన మరో ఇద్దరు చిన్నారులు అక్కడి నుంచి ఇళ్లకు చేరుకుని తమ స్నేహితులు నీట మునిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకునేసరికి చిన్నారులు మృతి చెంది నీటిలో తేలుతుండటాన్ని గమనించారు. దీంతో వారి తల్లిదండ్రులు అక్కడే బోరున విలపించారు. ఈ ఘటనతో దండుపల్లి గ్రామస్థులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాల్ని పోస్టు మార్టం నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా