మెదక్‌ జిల్లా పిట్టలవాడలో విషాదం

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పిట్టలవాడలో విషాదం చోటుచేసుకుంది. దండుపల్లి పంచాయతీ పిట్టలవాడ గ్రామం చెరువులో

Updated : 01 Oct 2020 20:23 IST

చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

తూప్రాన్‌: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. దండుపల్లి పంచాయతీ పిట్టలవాడ గ్రామం చెరువులో ఆడుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలవాడకు చెందిన రవి (6), నవీన్‌ (5), అఖిల(6) అనే చిన్నారులు మరో ఇద్దరితో కలిసి గురువారం ఆడుకుంటూ చెరువు సమీపంలోకి వెళ్లారు. 

ఈ క్రమంలో నీటిలో రాళ్లు వేస్తూ ఆడుకుంటుండగా.. రవి, నవీన్‌, అఖిల ఒకరి తర్వాత ఒకరు చెరువులో మునిగిపోయారు. ఇది గమనించిన మరో ఇద్దరు చిన్నారులు అక్కడి నుంచి ఇళ్లకు చేరుకుని తమ స్నేహితులు నీట మునిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకునేసరికి చిన్నారులు మృతి చెంది నీటిలో తేలుతుండటాన్ని గమనించారు. దీంతో వారి తల్లిదండ్రులు అక్కడే బోరున విలపించారు. ఈ ఘటనతో దండుపల్లి గ్రామస్థులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాల్ని పోస్టు మార్టం నిమిత్తం తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని