గ్యాస్ పైపులైన్లో పేలుడు.. ఇద్దరి మృతి
గుజరాత్లోని గాంధీనగర్లో ఓన్జీసీ పైపులైన్ పేలి రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఒకరు గాయపడ్డారు....
గాంధీనగర్: గుజరాత్లోని గాంధీనగర్లో ఓన్జీసీ పైపులైన్ పేలి రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఒకరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కలోల్లోని గార్డెన్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున పేలుడు సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పేలుడు శబ్దం కిలోమీటరు మేర వినిపించించడంలో ఉలిక్కపడ్డ ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఉన్న ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లు పేర్కొన్న అధికారులు పేలుడుకు గల కారణాలను నిపుణులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి...
దా‘రుణ’ యాప్ల వ్యవహారంలో ఆరుగురి అరెస్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె