అప్రమత్తత ఇద్దరిని కాపాడింది

రెప్పపాటు అప్రమత్తతతో తమిళనాడులో ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Updated : 28 Dec 2020 11:29 IST

చెన్నై : రెప్పపాటు అప్రమత్తతతో తమిళనాడులో ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వయలూరు ప్రాంతంలో రహదారి పక్కన ఇద్దరు యువకులు నిల్చొని ఉండగా.. అదుపు తప్పిన ఓ లారీ వారి వైపు దూసుకొచ్చింది. లారీ తమ వైపు వస్తున్నట్లు గమనించి.. చివరి క్షణంలో పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో వారి వాహనం లారీ చక్రాల కింద నలిగిపోయింది.

ఇవీ చదవండి..
ప్రేమ పెళ్లి.. వేదనతో ఉరి!
మనసు మార్చుకున్న ట్రంప్‌!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని