అదే పెద్దింటి అమ్మాయైతే ఇలాగే చేసేవారా?
బాధితురాలు ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే ఇలాగే ప్రవర్తించి ఉండేవారా’ అంటూ పోలీసుల వైఖరిని ప్రశ్నించింది. ఈ ఘటనలో మృతురాలు హిందువు అయినందున ఆ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించారా, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా, అధికార దుర్వినియోగానికి............
హాథ్రస్ ఘటనపై పోలీసులకు న్యాయస్థానం సూటి ప్రశ్న
లఖ్నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ కేసును విచారిస్తున్న లఖ్నవూ ధర్మాసనం.. ఈ కేసులో అధికారులు, పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక, సామాజిక స్థాయిని ప్రస్తావించిన యూపీ హైకోర్టు.. ‘బాధితురాలు ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే ఇలాగే ప్రవర్తించి ఉండేవారా’ అంటూ పోలీసుల వైఖరిని ప్రశ్నించింది. ఈ ఘటనలో మృతురాలు హిందువు అయినందున ఆ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించారా, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా అనే అంశాల నిర్ధారణ దిశగా సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
దళిత యువతిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాలతో సెప్టెంబరు 29న దిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా ఆమె మృతదేహాన్ని అదేరోజు రాత్రి స్వగ్రామానికి తరలించిన పోలీసులు.. కుటుంబ సభ్యులెవరూ లేకుండానే అంత్యక్రియలు నిర్వహించటం ప్రశ్నార్థకమైంది. ఈ కేసును న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ వీకే శశి న్యాయస్థానానికి తమ వాదనను వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా కోర్టు ఆదేశాలపై విచారణకు హాజరయ్యారు.
ధర్మాసనం ఏమందంటే..
శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే అధికారులు బాధితురాలి అంత్యక్రియలను అదే రోజు అర్థరాత్రి దాటాక చేపట్టాల్సి వచ్చిందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే ఈ సమాధానంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. బాధితురాలు పేద కుటుంబం నుంచి కాకుండా.. ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెంది ఉంటే పోలీసులు ఈ విధంగానే ప్రవర్తించేవారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వ యంత్రాంగం పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ కేసుకు అమిత ప్రాధాన్యం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం జీవించే హక్కులో గౌరవాన్ని పొందే హక్కు ఇమిడి ఉందని.. ఇది వ్యక్తుల మృతదేహాలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
సోమవారం నాటి విచారణకు బాధితురాలి కుటుంబ సభ్యులను కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. తమను పోలీసులు వేధిస్తున్నారని.. ఈ కేసును ఉత్తర్ ప్రదేశ్ పరిధి నుంచి దిల్లీ లేదా ముంబయికి బదిలీ చేయాలని వారు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కాగా, బాధితురాలి తరపున ప్రముఖ న్యాయవాది సీమా కుశ్వాహా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టు నవంబరు 2కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.