కుమారుడిని 28 ఏళ్లపాటు బంధించిన తల్లి
ప్రేమను పంచాల్సిన తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కన్న కుమారుడిని ఏళ్లపాటు బంధించి చిత్ర హింసలకు గురిచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 ఏళ్ల పాటు కుమారుడిని బంధించి...
దంతాలు విరగ్గొట్టి, ఒంటిపై వాతలు పెట్టి చిత్రహింసలు
స్టాక్హోమ్: ప్రేమను పంచాల్సిన తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కన్న కుమారుడిని ఏళ్లపాటు బంధించి చిత్ర హింసలకు గురిచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 ఏళ్ల పాటు కుమారుడిని బంధించి హింసించిన ఘటన స్వీడన్లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు సదరు మహిళను అరెస్టు చేశారు. గాయాలతో ఉన్న ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. స్టాక్హోమ్లోని మహిళ (70) ఇంటికి వెళ్లిన ఓ బంధువు ఆ ఇంట్లో బందీగా ఉన్న ఆమె కుమారుడి(41)ని గుర్తించాడు. దీనావస్థలో ఉన్న అతడిని విడిపించి ఆసుపత్రిలో చేర్పించాడు. అతడి దంతాలు పూర్తిగా ఊడిపోయి ఉన్నాయి. శరీరంపై గాయాలున్నాయి. వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు మహిళను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
12 ఏళ్ల కుమారుడు పాఠశాలలో ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లిన తల్లి అతడిని ఇంటికి తీసుకొచ్చి గదిలో బంధించింది. తర్వాత కుమారుడిని చిత్రహింసలకు గురిచేసింది. ఆ చిత్రహింసలు 28 ఏళ్లపాటు సాగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతడి దంతాలను పూర్తిగా విరగ్గొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు మాట్లాడలేకపోతున్నాడు. ‘ఆ ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో నుంచి తీవ్రస్థాయిలో దుర్వాసన వచ్చింది. ఆ ఇంటిని శుభ్రం చేయక ఏళ్లు గడుస్తున్నట్లుంది. అక్కడి పరిస్థితి చూశాక షాక్కు గురయ్యా. ఆమె తన కుమారుడిపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం చలాయిస్తోందని తెలుసు కానీ.. అది ఇంత తీవ్రస్థాయిలో ఉందని ఊహించలేకపోయా. అతడిని కాపాడినందుకు ఆనందంగా ఉంది’ అని సదరు బంధువు మీడియాతో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్