కుమార్తెలను రక్షించబోయి తల్లి కన్నుమూసింది!
వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం ఓ ఇంట విషాదం నింపింది. కుమార్తెలతో కలిసి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ తల్లి మృతి చెందిన ఘటన మర్పల్లి మండల పరిధిలోని షాపూర్తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన...
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన
మర్పల్లి: వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం ఓ ఇంట విషాదం నింపింది. కుమార్తెలతో కలిసి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ తల్లి మృతి చెందిన ఘటన మర్పల్లి మండల పరిధిలోని షాపూర్తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దశరథ్, అనితాబాయి(35)లకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఐదుగురు సంతానం. బుధవారం ఉదయం పత్తి పంటలో కలుపు తీయడానికి దశరత్, అనితతో పాటు ఐదుగురు పిల్లలు, మరో ముగ్గురు కలిపి మొత్తం 10 మంది ఆటోలో వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సాయంత్రం 4 గంటలకు భారీగా వర్షం కురిసింది. షాపూర్తండా సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోండటంతో కొంతసేపు నిరీక్షించారు. ఆ తర్వాత ఇంటి వద్ద పని ఉందని.. వెళ్దామంటూ అనిత తన భర్త దశరథ్కు చెప్పింది.
దీంతో కుమారులు, తండ్రి దశరథ్..ఒకరికొకరు చేతులు పట్టుకొని వాగు దాటారు. ఆ తర్వాత కుమార్తెలు వీణాబాయి, బబ్లూబాయి చేతులు పట్టుకొని అనితాబాయి వాగు దాటుతున్న క్రమంలో కుమార్తెలు జారి వాగులో కొట్టుకుపోయారు. ఇద్దరు కుమార్తెలను కాపాడే ప్రయత్నంలో అనిత కూడా వాగులో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన దశరథ్.. వీణాబాయి, బబ్లూబాయిలను రక్షించాడు. అప్పటికే అనితబాయి సుమారు 200 మీటర్ల దూరం కొట్టుకుపోవడంతో స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి అనితను ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించారు. అనంతరం వాగు అవతల చిక్కుకున్న మిగతా ముగ్గురుని స్థానికులు తాడు సాయంతో దాటించారు. ఘటనా స్థలాన్ని మర్పల్లి ఎస్సై సతీష్ చేరుకుని వివరాలు సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.