కట్నం కోసం.. అత్తింటి కిరాతకం!

వరకట్నం కోసం ఓ వివాహిత కళ్లు పీకేసి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బందా జిల్లాల్లో చోటు చేసుకుంది. ఈ రాష్ర్టంలోని బదౌషా ప్రాంతంలో తన ఇంటికి సమీపంలో నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని

Published : 14 Oct 2020 01:04 IST

లఖ్‌నవూ: కట్నం కోసం ఓ వివాహిత కళ్లు పీకేసి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బందా జిల్లాల్లో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలోని బదౌషా ప్రాంతంలో ఓ ఇంటికి సమీపంలో నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం మెడ, నడుముపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యకు గురైనట్లు ప్రాథమిక అంచనా వేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ అదే ప్రాంతానికి చెందిన సునీతగా తేలింది. తమ కూతురిని అత్తింటి వారే వరకట్నం కోసం చంపినట్లు మహిళ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు మహిళ అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహిళ భర్త పరారీలో ఉన్నట్లు గుర్తించారు. తన కొడుకు ఉద్యోగ అన్వేషణలో భాగంగా వేరే ఊరికి వెళ్లినట్లు మృతిచెందిన మహిళ అత్త పోలీసులకు వివరించారు. మృతిచెందిన మహిళ 2015లో ఆడపిల్లకు జన్మనిచ్చినప్పటి నుంచి భర్త ఆమెతో గొడవ పడుతున్నారని ఇంటి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి అదనపు ఎస్పీ మహేంద్ర ప్రతాప్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని