భర్త కళ్లముందే సామూహిక అత్యాచారం!

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్ల ముందే ఓ మహిళపై 17 మంది అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ అమానవీయ సంఘటన ముఫాసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 10 Dec 2020 01:09 IST

రాంచీ: ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్ల ముందే ఓ మహిళపై 17 మంది అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ అమానవీయ సంఘటన ముఫాసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఓ మహిళ తన భర్తతో కలిసి బయటికెళ్లి పని ముగిశాక ఇంటికి తిరుగు పయనమైంది. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు మార్గమధ్యంలో వారిని అడ్డుకున్నారు. అనంతరం వారు ఆమె భర్తపై దాడి చేసి.. అతడి కళ్లముందే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు ప్రారంభించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

ఆహారం ముట్టుకున్నాడని దారుణ హత్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని