ఆ యువతి 800 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే?
నాగ్పూర్: ఉద్యోగం నిమిత్తం స్నేహితురాలి పంచన చేరితే ఆమే మోసగించిన ఘటన, దాన్ని ఆసరా చేసుకొని ఓ నిందితుడి అఘాయిత్యం..బాధితురాలిని 800 కిలోమీటర్లు ప్రయాణించేలా చేశాయి.
నాగ్పూర్: ఉద్యోగం నిమిత్తం స్నేహితురాలితో కలిసుంటే ఆమె మోసిగింది.. దాన్ని ఆసరా చేసుకొని ఓ నిందితుడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఈ రెండు ఘటనలు బాధితురాలైన ఆ యువతిని ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించేలా చేశాయి. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి నుంచి తప్పించుకొని తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి ఆ యువతి ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఉద్యోగం నిమిత్తం నేపాల్కు చెందిన 22 ఏళ్ల యువతి రెండేళ్ల క్రితం భారత్కు వచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి తన స్నేహితురాలు అద్దెకు తీసుకున్న ఇంట్లో ఆమెతో కలిసి ఉంది. ఈ క్రమంలో సదరు స్నేహితురాలు దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోన్న తన స్నేహితుడు ప్రవీణ్ రాజ్పాల్ యాదవ్ను వీడియో కాల్ ద్వారా పరిచయం చేసింది. అయితే అప్పటికే నేపాలీ యువతి తన వద్ద ఉన్న సొమ్మును స్నేహితురాలికి ఇచ్చి దాచమనడం, తిరిగి ఆమెకు ఇవ్వకపోవడం వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ యువతి బాధితురాలిని తీవ్రంగా హింసించింది. ఇదే విషయాన్ని కొత్తగా పరిచయమైన దుబాయ్ స్నేహితుడికి చెప్పగా.. అక్కడి నుంచి వచ్చేయమని, దగ్గర్లోని హోటల్లో గది బుక్ చేశానని, అక్కడే ఉండమని చెప్పాడు.
అతడిది కూడా లఖ్నవూనే. రెండు రోజుల తరవాత అతడు భారత్కు వచ్చి, హోటల్ గదిలో ఆమెను కలవడంతో పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను అభ్యంతరకర రీతిలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత కూడా మరోసారి అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమె సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలను అప్లోడ్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, తన మాట వినకపోయినా వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. అయితే, సదరు బాధితురాలు ఎలాగోలా తప్పించుకొని 800 కిలోమీటర్లు ప్రయాణించి, సెప్టెంబర్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న నేపాలీ స్నేహితురాలి వద్దకు చేరుకుంది. అక్కడికి దగ్గర్లోని కొరాడి పోలీసు స్టేషన్లో లఖ్నవూ స్నేహితురాలు, యాదవ్పై ఫిర్యాదు చేసింది. అది వేరే రాష్ట్రం కేసు కావడంతో అక్కడి పోలీసులు దాన్ని జీరో ఎఫ్ఐఆర్గా పరిగణించి.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బాధితురాలితో పాటు పోలీసు బృందం లఖ్నవూకు చేరుకొని అక్కడి చిన్హాట్ పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ