బంజారాహిల్స్‌లో గోనెసంచిలో మృతదేహం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 2లో పాదచారుల బాటపై ఓ గోనె సంచిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Updated : 30 Aug 2020 16:45 IST

జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 2లో పాదచారుల బాటపై ఓ గోనె సంచిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సంచిలో మృతదేహం ఉన్నట్లు అనుమానంతో స్థానికులు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కొవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని గోనెసంచిని తెరిచారు. సంచిలో సుమారు 60 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం ఉంది. ఒంటిపై  ఏమైనా గాయాలున్నా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం ద్వారా మృతదేహాన్ని ఎవరు పడేశారనేది తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మహిళ ఎవరనేది తెలియాల్సి ఉందని, శవపంచనామా ద్వారా అసలు విషయం వెల్లడయ్యే వీలుందని పోలీసులు తెలిపారు. మహిళను హత్యచేసి ఇక్కడపడేశారా? మరేదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని