ధర్మవరంలో యువతి దారుణ హత్య

ధర్మవరం మండలం బడనపల్లెలో స్నేహలత అనే యువతి దారుణహత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం దుండగులు యువతి మృతదేహానికి నిప్పు పెట్టారు...

Published : 24 Dec 2020 00:59 IST

ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడనపల్లెలో స్నేహలత (19) అనే యువతి దారుణహత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం దుండగులు యువతి మృతదేహానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన స్నేహలత.. ధర్మవరం స్టేట్‌బ్యాంకులో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తోంది. విధులు ముగించుకుని ధర్మవరం నుంచి అనంతపురం బయల్దేరింది. మంగళవారం రాత్రి కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి కుల్లాయప్ప అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ బడనపల్లె వద్ద స్నేహలత మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రేమ పేరుతో రాజేశ్‌ అనే యువకుడు తమ కుమార్తెను వేధించేవాడని.. అతడి స్నేహితుడు కార్తీక్‌తో కలిసి తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లి ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి..

బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య

అమ్మ చనిపోయిన 10 రోజుల్లోనే అన్నదమ్ముల మృతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని