సెల్ఫీ తీసుకుంటూ గల్లంతైన యువకులు

సెల్ఫీ వారి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాకతీయ కాల్వలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధరూర్ మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Updated : 07 Sep 2020 05:51 IST

జగిత్యాల: సెల్ఫీ వారి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాకతీయ కాల్వలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధరూర్ మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని జగిత్యాల పట్టణానికి చెందిన కిరణ్‌ (33), రవి (27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని