TS News: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం వద్ద కూలిన భారీ వృక్షం.. వాహనాలు ధ్వంసం

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం ముఖద్వారం వద్ద ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. పూర్తిగా చెట్టు ఎండిపోవడంతో ఒక్కసారిగా నేలకొరిగింది. చెట్టుకింద పార్కింగ్‌ చేసిన ఏడు

Published : 12 Jan 2022 01:32 IST

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం ముఖద్వారం వద్ద ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. పూర్తిగా చెట్టు ఎండిపోవడంతో ఒక్కసారిగా నేలకొరిగింది. చెట్టుకింద పార్కింగ్‌ చేసిన ఏడు ద్విచక్రవాహనాలు, 3 కార్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో చెట్టుకింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఎండిపోయిన చెట్టును తొలగించాలని పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని