Crime News: రైలు ఇంజిన్కు చిక్కుకున్న మృతదేహం.. జమ్మికుంట స్టేషన్లో కలకలం
అండమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్కు మృతదేహం చిక్కుకుని రావడం కలకలం రేపింది.ఈ ఘటనతో రైలు గంటన్నర పాటు జమ్మికుంట స్టేషన్లోనే నిలిచిపోయింది.
కరీంనగర్: చెన్నై - జమ్ము వెళ్తున్న అండమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్కు మృతదేహం చిక్కుకుని ఉండడం కలకలం రేపింది. రైలు జమ్మికుంట స్టేషన్కి రాగానే ఇంజిన్కు చిక్కుకున్న మృతదేహాన్ని లోకో పైలెట్ గుర్తించి రైలును ఆపారు. మృతుడు హనుమకొండ నయీంనగర్కు చెందిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత ఉద్యోగి ఉప్పలయ్య(72)గా గుర్తించారు. మృతుడి జేబులో సూసైడ్ లేఖ లభ్యమైంది. తన చావుకు తానే కారణమని లేఖలో రాసి ఉందని అధికారులు వెల్లడించారు. కొంత కాలంగా ఉప్పలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో అండమాన్ ఎక్స్ప్రెస్ గంటన్నర పాటు జమ్మికుంట స్టేషన్లోనే నిలిచిపోయింది. మృతదేహాన్ని ఇంజిన్ నుంచి వేరు చేసిన తర్వాత అధికారులు రైలును పంపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nani: కొత్త దర్శకులకు ఛాన్సులు.. నాని ఖాతాలో హిట్లు
-
Politics News
ashok chavan: మోదీ బండారం బయటపడుతుందనే రాహుల్పై అనర్హత: అశోక్ చవాన్
-
India News
అగ్గి చల్లారిందా..? రాహుల్-ఉద్ధవ్ మధ్య ‘సావర్కర్ వివాదం’ సద్దుమణిగిందా..?
-
General News
Viveka Murder Case: ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్రెడ్డి
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!