Honour killing: కూతురు ప్రేమ పెళ్లిచేసుకుందని తండ్రి ఘాతుకం.. ఆరుగురి సజీవదహనం!
కన్నకూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుదుర్చిన సంబంధం వద్దని తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఇంటికి నిప్పంటించాడు........
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కన్నకూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుదుర్చిన సంబంధం వద్దని తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఇంటికి నిప్పంటించాడు. ఈ మంటలకు ఆ ఇంట్లో ఉన్న తన ఇద్దరు కూతుళ్లతో పాటు నలుగురు చిన్నారులూ సజీవదహనమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణం సెంట్రల్ పాకిస్థాన్లోని ముజఫర్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫౌజియా బీబీ (19) తన తండ్రి మంజూర్ హుస్సేన్ ఇష్టానికి వ్యతిరేకంగా 18 నెలల క్రితం మెహబూబ్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. కూతుర్ని ఎలాగైనా అంతమొందించాలని భావించిన మంజూర్ హుస్సేన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసు అధికారి అబ్దుల్ మాజీద్ వివరించారు. ఈ ఘటనలో ఫౌజియా బీబీ, ఆమె నాలుగు నెలల కొడుకుతో పాటు మంజూర్ హుస్సేన్ మరో కుమార్తె ఖుర్షిద్ మే (35), ఆమె ముగ్గురు పిల్లలూ మృతిచెందారు.
ఈ ఘటనపై ఫౌజియా భర్త మెహబూబ్ అహ్మద్ని పోలీసులు ప్రశ్నించగా.. ఆ సమయంలో తాను ఇంటి వద్ద లేనన్నారు. వ్యాపారం నిమిత్తం ముల్తాన్కు వెళ్లానని, తిరిగి తెల్లవారుజామున వస్తుండగా.. ఘటనా స్థలం నుంచి మంజూర్ హుస్సేన్, అతని కుమారుడు షాబిర్ హుస్సేన్లు పారిపోవడం చూసినట్టు పోలీసులకు చెప్పారు. తమ వివాహం తండ్రీకొడుకులిద్దరికీ ఇష్టంలేదన్నారు. ఈ ఘటనలో తన నాలుగు నెలల కొడుకుతో పాటు ఖుర్షిద్ మే ముగ్గురు పిల్లలు కూడా సజీవదహనమయ్యారని పోలీసులకు తెలిపారు. మరోవైపు, తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకుంటున్న కారణంగా ఏటా వందలాది మంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నట్టు పాకిస్థాన్ మానవహక్కుల కమిషన్ గణాంకాలు పేర్కొంటున్నాయి. మంజూర్ హుస్సేన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్