బాయ్‌ఫ్రెండ్‌ని బంధించి బాలికపై గ్యాంగ్‌రేప్‌

ఝార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు...

Published : 11 Oct 2020 01:04 IST

ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

జంషెడ్‌పూర్‌: అత్యాచారాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న సమయంలోనూ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఝార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. జంషెడ్‌పుర్‌లోని బాగ్బెరా ప్రాంతంలో బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న బాలిక వద్దకు వచ్చిన ఐదుగురు దుండగులు యువకుడిని బంధించి బాలికను గన్‌పాయింట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఓ మైనర్‌ కూడా ఉన్నాడు. ఘటన అనంతరం బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు శంకర్‌ తియూ, రోషన్‌ కుజుర్‌, సూరజ్‌ పాట్రో, సన్నీ సోరెన్‌ను అరెస్టు చేసినట్లు పోలీస్‌ సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. వారిని పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ‘ఘటన జరిగిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. డ్యాన్స్‌ తరగతులకు వెళ్లి వస్తుండగా తనను బంధించి తీసుకెళ్లినట్లు బాలిక తెలిపింది. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని