విమానంలో బట్టలు విప్పేసి.. హల్‌చల్‌!

బెంగళూరు నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానంలో ఇటీవల అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు ......

Published : 09 Apr 2021 01:12 IST

విమాన సిబ్బందితో అసభ్య ప్రవర్తన 

దిల్లీ: బెంగళూరు నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానంలో ఇటీవల అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్‌ 6న ఐ5-722 విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ  ప్రయాణికుడు బట్టలు విప్పేసి నానా బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తిస్తూ హల్‌చల్‌ చేశాడు. తొలుత అతడు లైఫ్‌ జాకెట్ల గురించి వాదనకు దిగాడు. అనంతరం సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అకస్మాత్తుగా బట్టల్ని పూర్తిగా విప్పేయడంతో తోటి ప్రయాణికులంతా విస్తుపోయారు.

ఈ ఘటనపై ఎయిర్‌ ఏషియా ఇండియా ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ, తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడు తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. తోటి ప్రయాణికులతో కలిసి సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేయడంతో చివరకు కూర్చున్నాడని చెప్పారు. ఆ తర్వాత దీని గురించి పైలట్లకు సమాచారం ఇచ్చారని వివరించారు. దీంతో పైలట్ జరిగిన సంఘటనపై దిల్లీలోని ఏటీసీకి సమాచారం అందించి, త్వరగా ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారు. విమానం దిల్లీలో ల్యాండింగ్‌ కాగానే, అతడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై దిల్లీ ఎయిర్‌ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. దిల్లీ పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని