Andhra News: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి

కర్నూలు మండలం పూలతోటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలోకి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే ముగ్గురిని కాపాడేందుకు యత్నించారు. కాగా ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందగా

Updated : 05 Mar 2022 10:57 IST

పూలతోట: కర్నూలు మండలం పూలతోటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలోకి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే ముగ్గురిని కాపాడేందుకు యత్నించారు. కాగా ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని బంధువులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని