Telangana: గోదావరిలో మునిగి విద్యార్థి మృతి..

నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి మెుదటి పుష్కర ఘాట్‌ వద్ద స్నానానికి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు.

Published : 05 Apr 2022 15:44 IST

నిర్మల్‌: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి మెుదటి పుష్కర ఘాట్‌ వద్ద స్నానానికి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం 10వ తరగతి విద్యార్థులను సరస్వతి అమ్మవారి దర్శనం కోసం బాసరకు తీసుకువచ్చింది. విద్యార్థులందరు కలిసి పుష్కరఘాట్‌లో స్నానానికి దిగగా విశాల్ అనే విద్యార్థి నీటి మునిగిపోయాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సహాయంతో విశాల్‌ను ఒడ్డుకు చేర్చారు. అయితే విశాల్ అప్పటికే మృతి చెందినట్లు తేలింది. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారమందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని