Crime News: ఆదోనిలో పందుల దొంగల బీభత్సం.. అడ్డుకున్న యువకుడి హత్య

కర్నూలు జిల్లా ఆదోనిలో పందుల దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగతనాన్ని అడ్డుకున్న జగన్నాథ్‌ సురేశ్‌ అనే

Published : 10 Jan 2022 01:48 IST

ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో పందుల దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగతనాన్ని అడ్డుకున్న జగన్నాథ్‌ సురేశ్‌ అనే యువకుడిని హత్య చేశారు. పందులను దొంగిలించిన వాహనాన్ని జగన్నాథ్‌ బైక్‌పై వెంబడించారు. దీంతో వారు తమ వాహనాన్ని వెనక్కి తిప్పి ఎదురుగా వచ్చి బైకును ఢీకొట్టారు. అనంతరం వాహనాన్ని వదిలేసి దొంగలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. దొంగలను కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని