Andhra news: ₹3.50 లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్‌ఓ

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వీఆర్‌ఓ రూ.3.50 లక్షల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు.

Updated : 01 Apr 2022 06:23 IST

గుంటూరు: గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వీఆర్‌ఓ రూ.3.50 లక్షల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. 35 ఎకరాల భూములకు సంబంధించి పాసుపుస్తకాల మంజూరు కోసం వీఆర్‌ఓ నాగభూషణం ఈ సొమ్మును డిమాండ్‌ చేశారు. దీంతో రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు రైతు వద్ద సొమ్ము తీసుకుంటుండగా పక్కా ప్రణాళిక ప్రకారం నాగభూషణంను పట్టుకున్నారు. వ్యవహారంలో బొల్లాపల్లి మండల తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రమేయంపై అధికారులు విచారిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని