Telangana News: సంగారెడ్డి ఎంపీవోపై ఏసీబీ కేసు.. అక్రమాస్తులెంతో తెలుసా?
సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్రెడ్డిపై ఆదాయానికి మించి
హైదరాబాద్: సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. సురేందర్రెడ్డి ఇంట్లో రూ.2.31కోట్ల విలువైన ఆక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. రూ.43.79 లక్షల విలువ చేసే నాలుగు ఓపెన్ ప్లాట్ల దస్త్రాలు, రూ.8.11లక్షల విలువైన వ్యవసాయ భూముల పత్రాలు, 190 తులాల బంగారం, రూ.4.22 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. ఎంపీవోకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తమకు సమాచారం వచ్చిందని.. హైదరాబాద్ అల్వాల్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి రూ.2.31కోట్ల ఆస్తులు గుర్తించామన్నారు. మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ.20కోట్ల నుంచి రూ.30 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సంగారెడ్డిలో పనిచేస్తున్న సురేందర్రెడ్డి.. గతంలో శంషాబాద్లో పనిచేసినపుడు భారీగా ఆస్తులు కూడబెట్టారని డీఎస్పీ చెప్పారు. ఎస్బీఐ బ్యాంకు లాకర్లలో బంగారం, సురేందర్రెడ్డి బావమరిది బినామీలుగా రెండు స్థిరాస్తులను గుర్తించినట్లు ఆయన వివరించారు. సురేందర్రెడ్డిని బుధవారమే అరెస్ట్ చేశామని.. వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు. ప్రస్తుతం సురేందర్రెడ్డి సస్పెన్షన్లో ఉన్నారని డీఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య