Crime News: శ్రీశైలం జాతీయ రహదారిపై డీసీఎం వ్యాను బీభత్సం

రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై డీసీఎం వ్యాను బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన డీసీఎం ప్రైవేటు ట్రావెల్స్‌

Updated : 11 Jul 2022 16:40 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై డీసీఎం వ్యాను బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన డీసీఎం ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టి ..కారు మరో డీసీఎంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు యూటర్న్‌ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టి పక్కనే ఉన్న కారు, కోళ్ల వ్యాన్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ట్రావెల్స్‌ బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో రెండు డీసీఎంలు, బస్సు ధ్వంసమయ్యాయి. ఘటనపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని