చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

కొంతనపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గానికి చెందిన మురళీ, అశోక్‌ కలిసి ..

Updated : 14 Mar 2021 02:56 IST

రాయదుర్గం: అనంతపురం జిల్లా కొంతనపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గానికి చెందిన మురళీ, అశోక్‌ కలిసి ఈ ఉదయం కారులో కనేకల్‌ బయల్దేరారు. కొంతనపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని