UP: కాన్పూర్‌లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్‌ సమీపంలోని సచెంది వద్ద  ఓ మిని బస్సు జేసీబీని ఢీకొని ఆపై బ్రిడ్జి నుంచి

Updated : 09 Jun 2021 11:27 IST

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్‌ సమీపంలోని సచెంది వద్ద  ఓ మిని బస్సు జేసీబీని ఢీకొని ఆపై బ్రిడ్జి నుంచి కిందపడింది. దీంతో 17 మంది మృతి చెందినట్లు కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలంలోనే పలువురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు లఖ్‌నవూ నుంచి దిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించారు. తక్షణమే ప్రమాదంపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షల పరహారం, గాయపడినవారికి  రూ.50,000 చొప్పున  ప్రకటించారు.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని