పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి

పెరూ దేశంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఉత్తర అంకాష్‌ ప్రాంతలోని సిహ్వాస్‌ ప్రావిన్స్‌లో జరిగింది.

Updated : 13 Apr 2021 12:31 IST

లిమా: పెరూ దేశంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఉత్తర అంకాష్‌ ప్రాంతంలోని సిహ్వాస్‌ ప్రావిన్స్‌లో జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇంకా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులంతా ఆదివారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం. సంఘటన గురించి తెలుసుకున్నాక వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు పెరు రవాణా శాఖ తెలియజేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని